365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 31,2025: అక్బర్బాగ్ ప్రాంతంలో వరద, మురుగు సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలన నిర్వహించారు. పరిస్థితిని పరిశీలించి సంబంధిత అధికారులను సమస్యను తక్షణమే పరిష్కరించడానికి ఆదేశించారు.
ప్రతి వర్షాకాలంలోనే ఈ ప్రాంతంలో వరద, మురుగు నీటి సమస్య తలెత్తుతోందని స్థానికులు కమిషనర్లకు వివరించారు. పై భాగం నుంచి వచ్చే వరద నీరు మూసీ వరకు సాఫీగా చేరే జంక్షన్ పైప్లైన్ దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తోందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి…ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం –పొగాకు బాలల భవితకు ముప్పు
ఇది కూడా చదవండి…‘ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక ఫెలోషిప్ బోధనా కార్యక్రమం ప్రారంభం
చర్చలో దాదాపు 100 మీటర్ల పైప్లైన్లో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగించేందుకు హై ప్రెజర్ జెట్టింగ్ మిషన్లను వినియోగించాలని సూచించారు.

అయితే ఈ ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వకపోతే, ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన కొత్త పైప్లైన్ నిర్మాణం చేపట్టాల్సిందిగా ప్రతిపాదన చేశారు.
ఈ సమస్య కోఠి నుంచి దిల్సుఖ్నగర్ వైపు, మలక్పేట రైల్వే స్టేషన్ నుంచి నల్గొండ చౌరస్తా మధ్య, మెట్రో పిల్లర్ నంబర్ 1417 నుంచి 1420 మధ్య తలెత్తుతోందని తెలిపారు.
Read This also…Hyderabad’s Residential Market Crosses ₹4,000 Crore in Home Sales for April 2025: Knight Frank India
Read This also…Jet Set Jalandhar: IndiGo Launches Direct Flights from Mumbai to Adampur
పై నుంచి వచ్చే వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో, హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు పరిశీలన నిర్వహించారు.