365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 8, 2025: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

గత కొన్ని రోజులుగా మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆదివారం 5:45లకు మృతి చెందారు.

Read This also…Get Ready for the Ultimate Knockout: Blockbuster Malayalam Film “Alappuzha Gymkhana” Premieres June 13, Only on Sony LIV

ఇది కూడా చదవండి…మహిళా ఎస్సైపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..

మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 లో వరుసగా మూడు సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ జీవితం టీడీపీతో ప్రారంభించిన ఆయన, అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. ప్రజల మద్దతుతో శాసనసభలో తనదైన ముద్రవేశారు.

ఆయన మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.