JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLEJYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, 2021 జూన్ 22: తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవ‌త్స‌రంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE

ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.

JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE
JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE

వ‌జ్ర క‌వ‌చంలో స్వామివారు ద‌ర్శ‌నం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా బుధ‌వారం ముత్య‌పుకవచంతో, గురువారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.