Fri. Oct 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 18,2024 : కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చలువరాయ స్వామి, శుక్రవారం నాడు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనం వద్ద ఆయనకు రిజిస్ట్రార్ డాక్టర్ పి. రఘురామిరెడ్డి ఘన స్వాగతం పలికారు.

అనంతరం, కర్ణాటక మంత్రి చలువరాయ స్వామి, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయం చేపడుతున్న బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే, వివిధ విభాగాలలో విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను, అందుకున్న పురస్కారాలను కూడా మంత్రి సమక్షంలో ప్రదర్శించారు.

కర్ణాటక మంత్రి, విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవడంపై ఆసక్తి వ్యక్తం చేశారు. అనంతరం, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్రోన్ అకాడమీని సందర్శించారు. డ్రోన్ అకాడమీ ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, సేవల గురించి మంత్రి శాస్త్రవేత్తలతో చర్చించారు.

పరిపాలన భవనంలోని అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కి కూడా చలువరాయ స్వామి సందర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఓ ఎస్ డి ప్రొఫెసర్ పాటిల్‌తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!