365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, మే 19, 2025: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటైన మహా కుంభ్ 2025లో వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై కోకా-కోలా ఇండియా చేపట్టిన ప్రతిష్టాత్మక ‘మైదాన్ సాఫ్’ కార్యక్రమాన్ని వివరించే డాక్యుమెంటరీని డిస్కవరీ ఛానల్ మే 19 సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేస్తోంది.
అలాగే, డిస్కవరీ+లో ఈ డాక్యుమెంటరీ మే 20న అందుబాటులో ఉంటుంది. ప్రయాగ్ రాజ్లోని కుంభ మేళా మైదానంలో తీసిన ఈ డాక్యుమెంటరీ కోకా-కోలా ఇండియా ఆన్-గ్రౌండ్ చర్యలు, సాంకేతికత, భాగస్వామ్యాలు,ఉద్దేశ్యాలను చూపిస్తుంది.
కోకా-కోలా ఇండియా – నైరుతి ఆసియా పబ్లిక్ అఫెయిర్స్, కమ్యూనికేషన్ & సస్టైనబిలిటీ ఉపాధ్యక్షురాలు దేవయాని ఆర్ఎల్ రాణా మాట్లాడుతూ, “మైదాన్ సాఫ్ మా బాధ్యతాయుతమైన ప్రవర్తన,పునర్వినియోగాన్ని ప్రోత్సహించడానికి మా కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.

ఇది కూడా చదవండి…Gen Z డిమాండుకు తగ్గట్టుగా అమెజాన్ ఫ్యాషన్ ‘సర్వ్’ ఆవిష్కరణ..
ఇది కూడా చదవండి…దక్షిణ భారతదేశంలో టొయోటా ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రారంభం
ఇది కూడా చదవండి…ఇసుజు మోటార్స్ ఇండియా తిరుపతిలో కొత్త 3S ఫెసిలిటీ ప్రారంభం
పునర్వినియోగపరచదగిన ప్యాకేజింగ్ డిజైన్, పదార్థ వినియోగం పెంపు, విస్తృత స్థాయి సేకరణకు మద్దతు వంటి లక్ష్యాల సాధనలో మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలు స్థానిక సాంస్కృతిక అవగాహన పెంచుతాయి” అని చెప్పారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దక్షిణాసియా ప్రకటనల ఆదాయాల అధిపతి తనజ్ మెహతా, “మార్పును సృష్టించడంలో కథనం శక్తి చాలా ముఖ్యం. మైదాన్ సాఫ్ ప్రచారం సాంస్కృతిక వారసత్వం, సమాజ భాగస్వామ్యం, ఆధునిక పర్యావరణ పరిరక్షణ పద్ధతులు కలిసి ఎంత సాధ్యమవుతుందో అందుకు మంచి ఉదాహరణ” అన్నారు.
ఈ డాక్యుమెంటరీలో మహా కుంభ్ 2025లో స్పెషల్ డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారి ఆకాంక్ష రాణా కూడా పాల్గొంటారు. ఆమె మాట్లాడుతూ, “ప్రతి రోజు సుమారు 1 నుంచి 2 కోట్ల మంది కుంభాన్ని సందర్శించి, 500 నుంచి 600 మెట్రిక్ టన్నుల వేర్వేరు వ్యర్థాలు ఉత్పత్తి చేస్తారు.
ఇలాంటి భారీ కార్యక్రమానికి కోకా-కోలా ఇండియా వంటి ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరం. బాధ్యతాయుత ప్రవర్తన మార్పులు,వ్యర్థాల పునర్వినియోగంపై వారి సహకారం మహా కుంభ్ మరింత పర్యావరణ హితంగా మారటానికి ముఖ్యపాత్ర వహించింది” అన్నారు.