Khammam District Additional Collector Snehalatha Visits to yerrupalem Khammam District Additional Collector Snehalatha Visits to yerrupalem

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 4, 2020,ఖమ్మం:పుస్తకాలు జ్ఞానాన్నిపెంచుతాయని గ్రామస్తులు పుస్తక విజ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత అన్నారు. ఆమె శనివారం పెగళ్లపాడు గ్రామం లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఏర్పాటుచేసిన మినీ లైబ్రరీని ప్రారంభించారు.

Khammam District Additional Collector Snehalatha Visits to yerrupalem
Khammam District Additional Collector Snehalatha Visits to yerrupalem

ఈ సందర్భంగా మాట్లాడుతూ… మినీ లైబ్రరీ ఏర్పాటు చేసిన పెగళ్లపాడు గ్రామ పంచాయతీని ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, ఎర్రుపాలెం ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు,పెగళ్లపాడు సర్పంచ్ సగ్గుర్తి రాజేశ్వరి,ఎంపీటీసీ కిషోర్ బాబు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు వెంకటరమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.