365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 15,2022: ఆయన సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ప్రధాని మోదీతో భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ మూసీ క్లీనింగ్, నేషనల్ హైవే సమస్యలపై ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పార్టీ ఏర్పాటు చేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని ముందుగా చెప్పారు.
కేంద్ర కమిటీలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతున్న తరుణంలో ఆయన ప్రధానిని కలవబోతున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది.
ఎంపీగా ప్రధానిని కలవడం మామూలేనని కోమటిరెడ్డి సన్నిహితులు చెప్పడం గమనార్హం.