Thu. Sep 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగస్ట్ 31, 2024:LG ఎలక్ట్రోనిక్స్ ఇండియా, హైదరాబాద్ లోని MPUPS హిమాయత్ సాగర్ స్కూల్ లో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించి, తమ ఫ్లాగ్ షిప్ “లైఫ్స్ గుడ్ న్యూట్రిషన్” ప్రోగ్రాం కోసం ఈ ఏడాది కార్యకలాపాలను ప్రారంభించింది.

అక్షయ పాత్ర ఫౌండేషన్ ,అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమం, 2024 దశ ప్రారంభానికి గుర్తుగా నిలిచింది. ఇది అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల విద్యాపరమైన పోషకాహార సంక్షేమాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సృజనాత్మకతను ప్రేరేపించి, కమ్యూనిటీ భావనను ప్రోత్సహించడానికి రూపొందించిన వివిధ కార్యకలాపాలలో విద్యార్థులు పాల్గొన్నారు.

పిల్లలు రంగులు వేయడం. చిత్ర లేఖనం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు, ప్రతి విద్యార్థికి కళాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించేందుకు కలరింగ్ క్రేయాన్లు అందించారు.

సమాపన కార్యక్రమంలో పోషకాహార భోజనాల వడ్డన, బహుమతుల పంపిణీతో విద్యార్థుల ఆరోగ్యానికి సాధనలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన పోషకాహారాన్ని కేటాయించే ప్రోగ్రాం కీలకమైన మిషన్ ను ప్రతిబింబించింది.

LG వారి “లైఫ్స్ గుడ్ న్యూట్రిషన్” ప్రోగ్రాం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది, ఇది 2019లో ప్రారంభించబడింది. భారతదేశం వ్యాప్తంగా పిల్లల పోషకాహార హోదాను మెరుగుపరచడంలో ఇది కీలకంగా నిలిచింది, వారి పూర్తి అభివృద్ధి అకాడమిక్ విజయానికి సహకరించింది.

యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డవలప్ మెంట్ గోల్స్ (SDGs) అనుసంధానంలో, ఈ ప్రోగ్రాం జీరో హంగర్, మంచి ఆరోగ్యం & సంక్షేమం, నాణ్యతతో కూడిన చదువు అసమానతలను తగ్గించడంపై దృష్టి సారించింది.

ప్రోగ్రాం ఆరంభమైన నాటి నుండి గణనీయంగా విస్తరించింది, 2024లో ఇది దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది విద్యార్థులను చేరుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది.

error: Content is protected !!