365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 26, 2023:భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా మార్కెట్ కేపిటలైజేషన్ సాధించిన కంపెనీల జాబితాలోకి ప్రవేశించింది. 2023 ఆగస్టు 24న కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ఠంతో రూ.503.35కు చేరుకుంది.

రాబోయే సంవత్సరాల్లో కూడా ఆదాయం, లాభాల్లో ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. నికర రుణ రహిత హోదాను కొనసాగిస్తూనే 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.750 కోట్ల ఆదాయాన్ని సాధించాలన్నది కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యం.
2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలను నివేదించింది. అత్యధిక రెవెన్యూ, ఈబీఐటీడీఏ, నికర లాభాలు ఆర్జించింది. కంపెనీ రూ.500 కోట్లకు పైగా రెవెన్యూ, రూ.100 కోట్లకు పైగా పన్నుకు ముందు లాభాలు తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో సాధించింది.
2024 మొదటి త్రైమాసికంలో కూడా కంపెనీ అద్భుతమైన ఆపరేషనల్, ఫైనాన్షియల్ పనితీరు కనబరిచింది. ముందు ఏడాదితో పోలిస్తే నికరలాభంలో 26.7% వృద్ధి, ఈబీఐటీడీఏలో 21.4%, మొత్తం ఆదాయంలో 10.3% వృద్ధిని సాధించింది.

గుజరాత్ లోని మెహసానాలో సెఫలోస్పోరిన్ ప్లాంట్ విస్తరణను కంపెనీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్లాంట్ నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగుమతుల కోసం అనేక దేశాలకు ఈ ఉత్పత్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నందున ఈలోపు కంపెనీ దేశీయ మార్కెట్లలో విక్రయించడం ప్రారంభించింది. వచ్చే మూడేళ్లలో ఈ ప్లాంట్ నుంచి సుమారు రూ.150 కోట్ల అమ్మకాలు అవుతాయని అంచనా.