Thu. Jul 4th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 1,2024: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. చిన్నా, పెద్దా, ముసలి ఎవరు చూసినా.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే శనివారం చివరి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే.. ఎగ్జిట్ పోల్స్ వెలువడున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎవరు గెలుస్తారు అనే దానిపై ఒక స్పష్టత రానుంది. అయితే అవే నిజం అవుతాయని కాకపోయినా.. ఎవరికి మెజార్టీ వస్తుంది..

ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై ఒక అంచనాకు రావచ్చు. అయితే జూన్ 4వ తేదీన లోకసభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

అయితే తాజాగా జూన్ 4 వ తేదీన వెల్లడి కానున్న లోక్సభ ఎన్నికల ఫలితాలను సినిమా థియేటర్లలో ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు.

జూన్ 4 వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాలకోసం, ఓట్ల లెక్కింపు కోసం.. దేశవ్యాప్తంగా జనాలు.. దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు సినిమా థియేటర్లలో ప్రసారం చేసేందుకు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఏర్పాట్లు చేశాయి.

దీంతో వీటి కోసం ఇప్పటికే ఆ లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రసారాలకు సంబంధించి.. టికెట్ బుకింగ్లను ఆయా థియేటర్లు ప్రారంభించాయి. ముంబైలోని ఎస్ఎం5 కల్యాణ్, సియాన్.. కంజూర్మాలోని మూవీమ్యాక్స్ థియేటర్లు..

థానేని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్.. నాగ్పూర్ లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్ తదితర థియేటర్లు ఈ అవకాశాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 4 వ తేదీన

ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్పై ప్రసారంచేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినఇప్పటికే పేటీఎం వంటి ప్లాట్ఫామ్లలో బుకింగ్స్ను ప్రారంభించాయి.ఇక జూన్ 4 వ తేదీన ఎన్నికలఫలితాలను 6 గంటల పాటు థియేటర్లలో లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్లు సమాచారం.

Bank of India Launches 666 Days – Fixed Deposit with High Return 

ఇది కూడా చదవండి : ఎల్‌ఐసీ నుంచి త్వరలోఅందుబాటులోకి రానున్న ఆరోగ్య బీమా

ఇది కూడా చదవండి : నేటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ నియమాల్లో మార్పులు..

ఇది కూడా చదవండి :అంటార్కిటికాలో మైత్రి-II పరిశోధనా కేంద్రం ఏర్పాటు

ఇది కూడా చదవండి :చమురు కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ ధరలను రూ.69.50 తగ్గించాయి