365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్, ఏప్రిల్ 17,2025: కారు కొనుగోలు అనుభవాన్ని వినూత్నంగా మార్చేందుకు JSW MG మోటార్ ఇండియా తమ ప్రియమైన SUV మోడల్ హెక్టర్ కోసం ప్రత్యేక కాంపైన్ను ప్రారంభించింది. “మిడ్నైట్ కార్నివాల్” పేరుతో విడుదలైన ఈ క్యాంపైన్ తక్కువ కాలం పాటు ప్రతి వారాంతంలో అర్థరాత్రివరకు షోరూంలను తెరిచి ఉంచి వినియోగదారులను ఆకర్షించనుంది.
ఈ సందర్భంగా హెక్టర్ కొనుగోలు చేసే 20 మంది అదృష్టవంతులు లండన్కు పర్యటన చేసే అవకాశాన్ని గెలుచుకోవచ్చు. అలాగే ఒక్కోరు రూ.4 లక్షల విలువైన ప్రయోజనాలను పొందనున్నారు.
ఇది కూడా చదవండి...జపాన్ దిగ్గజం మారుబేని తో ₹1,000 కోట్ల ఒప్పందం – సీఎం రేవంత్ రెడ్డి విజయం
ఇది కూడా చదవండి...వివో X200 అల్ట్రా కెమెరా ఫీచర్లు అదుర్స్: ఐఫోన్ 16 ప్రో మాక్స్ను సవాలు చేసే సామర్థ్యం!
హెక్టర్ కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనాలు:
- 2 సంవత్సరాల అదనపు రోడ్సైడ్ అసిస్టెన్స్
- 1 లక్ష కిలోమీటర్లు లేదా 2 సంవత్సరాల అదనపు వారంటీ
- ప్రస్తుతం నమోదైన హెక్టర్ వాహనాలపై 50 శాతం RTO ప్రయోజనాలు
- ఉచిత MG యాక్సెసరీస్
ఈ అవకాశాలతో కలిపి మొత్తం 5 సంవత్సరాల నిరభ్యంతర యాజమాన్య అనుభవాన్ని కంపెనీ హామీ ఇస్తోంది.

ఈ సందర్భంగా JSW MG మోటార్ ఇండియా సేల్స్ హెడ్ రాకేష్ సేన్ మాట్లాడుతూ, “హెక్టర్ భారత SUV మార్కెట్లో ప్రజాదరణ పొందిన మోడల్. ‘మిడ్నైట్ కార్నివాల్’ ద్వారా వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపైన్ను ప్రారంభించాం” అని తెలిపారు.
ఇది కూడా చదవండి...భారత మార్కెట్లో తన సెకండ్ జనరేషన్ కోడియాక్ ఎస్యూవీని విడుదల చేసిన స్కోడా..
ఇది కూడా చదవండి…ఐఫోన్ 15పై అమెజాన్ భారీ డిస్కౌంట్: కేవలం రూ.28,830కే సొంతం
విలక్షణ ఫీచర్లతో హెక్టర్ ముందే:
2019లో భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ SUVగా ప్రారంభమైన MG హెక్టర్ స్మార్ట్ టెక్నాలజీ, స్టైల్, భద్రత కలయికతో ముందంజలో నిలిచింది. ఇందులో 14 అంగుళాల HD ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డ్యూయల్ పేన్ సన్రూఫ్, 70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఆధునిక ADAS సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
*నియమాలు & షరతులు వర్తిస్తాయి
**వేరియంట్ & గ్రేడ్ ఆధారంగా ప్రయోజనాలు మారవచ్చు