365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మహబూబాబాద్,మే 2, 2025: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని శ్రీకంఠమహేశ్వర స్వామి-సురమాంబదేవి విగ్రహ ప్రతిష్ఠ కమిటీ మరియు గౌడ సంఘం ప్రముఖులు శుక్రవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈనెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కల్వల గ్రామంలో జరగనున్న శ్రీకంఠమహేశ్వర స్వామి-సురమాంబదేవి విగ్రహ ప్రతిష్ఠ , కళ్యాణోత్సవ కార్యక్రమాలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ముఖ్య అతిథిగా హాజరు కావాలని గౌడ సంఘం ప్రముఖులు కోరారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో చింతనూరి వెంకన్న, పెరుమాండ్ల ఎల్లా గౌడ్, బొగ్గుల యాలాద్రి, మోడెం వెంకటేశ్వర్లు, ఓరుగంటి వెంకన్న, ప్రముఖ టీవీ యాంకర్ వేముల రాజేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామంలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.