365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబయి, ఏప్రిల్ 4,2025: దేశంలో క్లిష్ట సమస్యలకు పరిష్కారంగా మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎంఐఎఫ్) ప్రోత్సహిస్తున్న ఆవిష్కరణలు నూతన దిశగా సాగుతున్నాయి. వాతావరణ మార్పులకు సరిపోయే సాంకేతికతల నుంచి, వ్యవసాయ రంగంలో నవీనతల దాకా – నీటి కొరత నివారణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వాహణ, వ్యర్థాల నుంచి ఫర్నిచర్ తయారీ, పరిశ్రమల ఉద్గారాల నుంచి విలువైన రసాయనాల తయారీ, భూఅయస్కాంతాల్లేని మోటార్ల అభివృద్ధి వంటి రంగాల్లో అనేక ఆవిష్కర్తలు ముందుకొస్తున్నారు.

ఈ నూతన ఆవిష్కరణలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, నిపుణుల మార్గదర్శనం అవసరమన్న ఉద్దేశంతో మారికో సంస్థ ‘ఇన్నోవిన్ డే’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఇండియన్ ఇన్నోవేషన్ ఐకాన్స్ 2025 విజేతలు, ఎంఐఎఫ్ స్కేల్-అప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అగ్రిటెక్, క్లీన్టెక్, సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో ఉత్తమంగా నిలిచిన 24 మంది ఆవిష్కర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Read this also…Marico Innovation Foundation Launches InnoWin Day to Accelerate India’s Cleantech, Circularity, and Agritech Innovations..

Read this also…What is the Real Purpose of the Waqf Board?

ఈ కార్యక్రమంలో అస్సిస్టెక్ ఫౌండేషన్, చారా టెక్నాలజీస్, ఇంద్రావాటర్, ప్యాడ్‌కేర్, రిక్రాన్ ప్యానెల్స్, అర్బన్ కిసాన్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. ఇవి తమ పరిష్కారాల ద్వారా సామాజిక సమస్యలను అధిగమించే దిశగా పురోగమిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మారికో ఛైర్మన్, ఎంఐఎఫ్ వ్యవస్థాపకుడు హర్ష్ మారివాలా పాల్గొన్నారు. అనంతరం జరిగిన “స్కేలింగ్ స్ట్రాటజీస్” అనే ప్యానెల్ చర్చలో S4S టెక్నాలజీస్ CEO వైభవ్ తిడ్కే, ఆటంబర్గ్ టెక్నాలజీస్ CBO అరిందమ్ పాల్లు పాల్గొన్నారు. వారు తమ వ్యాపారాలు ఎలా వేగంగా విస్తరించాయో, ఎంఐఎఫ్ అందించిన మార్గదర్శకత ఎలా సహాయపడిందో వివరించారు.

వైభవ్ మాట్లాడుతూ, “2019లో మా ఆదాయం రూ.60 లక్షలుండగా, 2023లో అది రూ.100 కోట్లకు చేరింది. ఇది ఎంఐఎఫ్ వ్యూహాత్మక మద్దతు వల్లే సాధ్యమైంది,” అని తెలిపారు. ఆటంబర్గ్ కంపెనీ ప్రాతినిధి అరిందమ్ మాట్లాడుతూ, “2017లో స్కేల్-అప్ కార్యక్రమంలో చేరాక మా ఆన్‌లైన్ విక్రయాలు బలపడి, ఆ తర్వాత ఆఫ్‌లైన్ విస్తరణ వైపు దృష్టి పెట్టాం. ఈ మార్గదర్శనం మా వ్యాపార ప్రగతిలో కీలకంగా నిలిచింది,” అన్నారు.

ఇది కూడా చదవండి..వక్ఫ్ బోర్డు అసలు లక్ష్యం ఏంటి..?

ఇది కూడా చదవండి...ZEE5లో సందీప్ కిషన్ ‘మజాకా’ విజయం.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటిన రికార్డ్!

ఈ సందర్భంగా హర్ష్ మారివాలా మాట్లాడుతూ, “ఆవిష్కర్తలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకోవాలి. మూలధనం, మార్కెట్ ప్రాప్యత, నైపుణ్యం ఇవన్నీ పెంచేందుకు ఇన్నోవిన్ డే ఉపయోగపడుతుంది,” అన్నారు.

మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ అధిపతి సురంజనా ఘోష్ మాట్లాడుతూ, “ఈ రోజు కార్యక్రమం ద్వారా మేం ఆవిష్కర్తల్ని సరైన వనరులతో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. వీరి పరిష్కారాలు భవిష్యత్తుకు కీలకంగా మారతాయి,” అన్నారు.