365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 20,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం విలవిల్లాడాయి. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగడంతో ఆఖరి రెండు గంటల్లోనే విపరీతంగా కుంగాయి.
నిఫ్టీ50 పది నెలల్లోనే అత్యంత ఘోర పతనం చవిచూసింది. బెంచ్మార్క్ సూచీలు ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలకు చేరడం, కరోనా భయం మొదలవ్వడం, ఎర్రసముద్రం వద్ద నౌకల అడ్డగింతతో ముడిచమురు సరఫరాకు అంతరాయం కలగడం, మూమెంటమ్ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణాలు.

అన్ని రంగాల సూచీలు నేడు ఎరుపెక్కాయి. ముఖ్యంగా మీడియా, పీఎస్యూ బ్యాంకు, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఓవర్ వాల్యూ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లనూ అమ్మేశారు.
క్రితం సెషన్లో71,437 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 71,647 వద్ద ఆరంభమైంది. మరికాసేపటికే 71,913 వద్ద ఇంట్రాడేలో లైఫ్ టైమ్ హైను తాకింది.
అయితే ఆఖరి రెండు గంటల్లో సెల్లాఫ్ మొదలవ్వడంతో 70,302 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. మొత్తంగా 930 పాయింట్లు నష్టపోయి 70,506 వద్ద ముగిసింది.
బుధవారం 21,543 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,593 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 21,087 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి 302 పాయింట్ల పతనంతో 21,150 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 425 పాయింట్లు ఎరుపెక్కి 47,445 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 4 కంపెనీలు లాభపడగా 46 కంపెనీలు నష్టపోయాయి. ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, బ్రిటానియా, సిప్లా టాప్ గెయినర్స్. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, యూపీఎల్, కోల్ ఇండియా టాప్ లాసర్స్. నేడు అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
మీడియా, పీఎస్యూ బ్యాంకు, మెటల్ 5-3 శాతం వరకు పతనమయ్యాయి. ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్ కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 1-3 శాతం వరకు కుంగాయి.
ఫియర్ ఇండెక్స్గా భావించే ఇండియా విక్స్ 4.20 శాతం వరకు పెరిగి 14.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 ఘోర పతనంలో రిలయన్స్ (27), ఎల్టీ(24), ఇన్ఫోసిస్ (20), ఎస్బీఐ (17), ఐసీఐసీఐ బ్యాంకు కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది.
నిఫ్టీ50 డిసెంబర్ ఫ్యూచర్స్ సపోర్టు 21,100, రెసిస్టెన్సీ 21500 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్మ్లో టాటా కన్జూమర్, వీ మార్ట్, వోల్టాస్, జీఎంఎం పీఫ్యాడ్లర్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

నిఫ్టీ50 ఘోర పతనంలో రిలయన్స్ (27), ఎల్టీ(24), ఇన్ఫోసిస్ (20), ఎస్బీఐ (17), ఐసీఐసీఐ బ్యాంకు (17) కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది.
బ్లూస్టార్ ఇండియాకు ముంబయి, జైపుర్ జీఎస్టీ అధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. సుప్రీం పెట్రోకెమికల్ చెన్నై ప్లాంటులో కార్యకలాపాలు తిరిగి మొదలుపెట్టింది.
ఇండస్ టవర్ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. కెన్ఫిన్ హోమ్స్ ఒక్కో షేరుకు రెండు రూపాయల మధ్యంతర డివిడెండును ఆమోదించింది.
ఐదు వీడియో గేమ్స్ పబ్లిష్ చేయడంతో నజారా టెక్ షేర్లు 5 శాతం మేర ఎగిశాయి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్కు పవర గ్రిడ్ నుంచి రూ.219 కోట్ల ఆర్డర్ వచ్చింది.

రూ.62 చొప్పున మదర్సన్ సుమిలో 10.4 లక్షల షేర్లు చేతులు మారాయి. ఆయిల్ ఇండియా షేర్లు 19 శాతం పెరగడం విశేషం. పేటీఎంలో భారీ ట్రేడ్ జరిగింది. రూ.633 చొప్పున 12.9 లక్షల షేర్లు చేతులు మారాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709