365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 29,2025: JSW MG మోటార్ ఇండియా తన ప్రముఖ SUV MG అస్టర్ ను ‘బ్లాక్‌బస్టర్ SUV’గా కొత్త ఊహతో మార్కెట్లోకి విడుదల చేసింది. 2025 మోడల్‌లో అదనపు ఫీచర్లు, ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ, అధిక భద్రతా ప్రమాణాలతో కొత్త శకానికి నాంది పలుకుతోంది.

MY2025 ఎడిషన్‌లోని MG అస్టర్ విభాగంలో ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ, రూ. 12.5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపలే పనోరామిక్ సన్‌రూఫ్ అందించే ఏకైక SUVగా నిలిచింది. అదనంగా, సెలెక్ట్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఐవరీ లెదరెట్ సీట్లు లాంటి సౌకర్యాలు జోడించబడాయి. SUV ప్రియులు తమ దగ్గరలోని JSW MG మోటార్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించి, రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అస్టర్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ SUV 1.5L MT & CVT, 1.3L Turbo AT పవర్‌ట్రెయిన్స్‌లో అందుబాటులో ఉంది.

Read this also…MG Astor MY2025: ‘The Blockbuster SUV’ with Advanced Tech and Safety

ఇది కూడా చదవండి..100 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో జియో హాట్‌స్టార్ విశ్వరూపం

Read this also…“Powerful Earthquake Strikes Myanmar: 150 Dead, India Rushes Aid”

AI & భద్రతా టెక్నాలజీ:
MG అస్టర్ AI పర్సనల్ అసిస్టెంట్ కలిగిన భారతదేశపు మొట్టమొదటి SUV. అంతేగాక, 14 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. మొత్తం 50కి పైగా భద్రతా ఫీచర్ల తో ఈ SUV డిజిటల్ కీ & యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ తో వస్తుంది.

ఆధునిక కనెక్టివిటీ:
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ ప్లే
వైర్‌లెస్ ఛార్జర్
ఆటో-డిమ్మింగ్ IRVM
i-SMART 2.0 & 80+ కనెక్టెడ్ కార్ ఫీచర్లు

JIO వాయిస్ అసిస్టెంట్ కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణ. వాతావరణం, క్రికెట్ స్కోర్లు, క్యాల్క్యులేటర్, న్యూస్ అప్‌డేట్స్, జాతకం, నిఘంటువు వంటి సమాచారం అడగగానే అందుబాటులోకి వస్తాయి.

ఇది కూడా చదవండి..మయన్మార్‌లో భూకంపం.. ఇప్పటివరకు150 మంది ప్రాణాలు మృతి..

ఇది కూడా చదవండి..భారతదేశంలో డేటా సెంటర్లు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి.. ?

JSW MG మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ & ఆపరేషన్స్) రాకేష్ సేన్ మాట్లాడుతూ, “MG అస్టర్ బ్లాక్‌బస్టర్ SUV మాత్రమే కాదు, అది ప్రతి డ్రైవింగ్ అనుభవాన్ని ప్రేరణగా మార్చే కార్. సౌకర్యం, స్టైల్, టెక్నాలజీ సమ్మేళనంగా ఇది మారుతుంది” అని అన్నారు.

SUV ప్రియులకు ఇది నిజంగా బ్లాక్‌బస్టర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నదని కంపెనీ చెబుతోంది.