365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ మే 14 ,2021:ఇప్పటిదాకా భారత దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య కీలకమైన మైలురాయి చేరుతూ ఈరోజు 2 కోట్లు దాటింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 83.50% అయింది. గత 24 గంటలలో 3,44,776 మంది కోలుకున్నారు. ఇది కొత్తగా నమోదైన కోవిడ్ కేసులకంటే ఎక్కువ కావటం గమనార్హం. కొత్తగా కోలుకున్నవారిలో 71.16% వాటా పది రాష్ట్రాలదే కావటం కూడా గమనార్హం.

గడిచిన 14 రోజులలో కోలుకున్నవారి సంఖ్యను ఈ దిగువ చిత్రపటం చూపుతోంది.

More than 2 crore recovered Kovid victims in the country
దేశంలో మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ఈ రోజు 37,04,893 కు తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.41% వాటా. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య నికరంగా 5,632 తగ్గింది. చికిత్సలో ఉన్న కేసులలో 12 రాష్ట్రాల వాటా 79.7%

భారత ప్రభుత్వం అందుకున్న అంతర్జాతీయ సాయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కేటాయించి వేగంగా పంపుతోంది. ఇప్పటిదాకా మొత్తం 9,294 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 11,835 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6,439 వెంటిలేటర్లు, దాదాపు 4.22 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను రోడ్డు, వాయు మార్గాల ద్వారా రాష్టాలకు తరలించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా మూడో దశ టీకాల కార్యక్రమం మొదలవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య వేగంగా పెరుగుతూ 18 కోట్లకు దగ్గరవుతూ ఉంది. 26,02,435 శిబిరాల ద్వారా మొత్తం 17,92,98,584 టీకా డోసులు ఇచ్చినట్టు ఉదయం 7 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 96,18,127 మొదటి డోసులు, 66,04,549 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న 1,43,22,390 మొదటి డోసులు, 81,16,153 రెండో డోసులు, 18-45 వయోవర్గం వారు అందుకున్న మొదటి డోసులు 39,26,334 ఉండగా, 45-60 వయీవర్గం వారు తీసుకున్న 5,66,09,783 మొదటి డోసులు, 85,39,763 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,42,42,792 మొదటి డోసులు, 1,73,18,693 రెం డో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 96,18,127 |
రెండో డోస్ | 66,04,549 | |
కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 1,43,22,390 |
రెండో డోస్ | 81,16,153 | |
18-44 వయోవర్గం | మొదటి డోస్ | 39,26,334 |
45 – 60 వయోవర్గం | మొదటి డోస్ | 5,66,09,783 |
రెండో డోస్ | 85,39,763 | |
60 పైబడ్డవారు | మొదటి డోస్ | 5,42,42,792 |
రెండో డోస్ | 1,73,18,693 | |
మొత్తం | 17,92,98,584 |
ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో పది రాష్ట్రాలవాటా 66.75% ఉంది.

గత 24 గంటలలో 18-44 వయీవర్గానికి చెందిన లబ్ధిదారులు 4,40,706 డోసులు తీసుకోగా వీరికి టీకాలు మొదలైన మే 1 నుంచి ఈ వయోవర్గం 32 రాష్ట్రాలలో కలిపి తీసుకున్న మొత్తం డోసుల సంఖ్య 39,26,334 కు చేరింది. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 వయోవర్గం వారు తీసుకున్న టీకా వివరాల పట్టిక ఇది:
సంఖ్య | రాష్ట్రం | మొత్తం |
1 | అండమాన్- నికోబార్ దీవులు | 1,175 |
2 | ఆంధ్రప్రదేశ్ | 2,153 |
3 | అస్సాం | 1,48,136 |
4 | బీహార్ | 4,04,150 |
5 | చండీగఢ్ | 2 |
6 | చత్తీస్ గఢ్ | 1,028 |
7 | దాద్రా-నాగర్ హవేలి | 729 |
8 | డామన్-డయ్యూ | 861 |
9 | ఢిల్లీ | 5,23,094 |
10 | గోవా | 1,757 |
11 | గుజరాత్ | 4,19,839 |
12 | హర్యానా | 3,84,240 |
13 | హిమాచల్ ప్రదేశ్ | 14 |
14 | జమ్మూకశ్మీర్ | 30,169 |
15 | జార్ఖండ్ | 94 |
16 | కర్నాటక | 1,04,242 |
17 | కేరళ | 1,149 |
18 | లద్దాఖ్ | 86 |
19 | మధ్యప్రదేశ్ | 1,36,346 |
20 | మహారాష్ట్ర | 6,34,570 |
21 | మేఘాలయ | 6 |
22 | నాగాలాండ్ | 4 |
23 | ఒడిశా | 1,08,296 |
24 | పుదుచ్చేరి | 2 |
25 | పంజాబ్ | 5,755 |
26 | రాజస్థాన్ | 5,90,276 |
27 | తమిళనాడు | 26,467 |
28 | తెలంగాణ | 500 |
29 | త్రిపుర | 2 |
30 | ఉత్తరప్రదేశ్ | 3,15,928 |
31 | ఉత్తరాఖండ్ | 67,427 |
32 | పశ్చిమ బెంగాల్ | 17,837 |
మొత్తం | 39,26,334 |
గత 24 గంటలలో 20 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 118 వ రోజైన మే 13న 20,27,162 టీకాలివ్వగా 18,624 శిబిరాలలో 10,34,304 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 9,92,858 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీ: మే 13, 2021 (118వ రోజు)
ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 17,022 |
రెండో డోస్ | 33,409 | |
కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 83,628 |
రెండో డోస్ | 83,594 | |
18-44 వయోవర్గం | మొదటి డోస్ | 4,40,706 |
45 – 60 వయోవర్గం | మొదటి డోస్ | 3,53,966 |
రెండో డోస్ | 3,68,924 | |
60 పైబడ్డవారు | మొదటి డోస్ | 1,38,982 |
రెండో డోస్ | 5,06,931 | |
మొత్తం | మొదటి డోస్ | 10,34,304 |
2ndDose | 9,92,858 |
దేశంలో పెరుగుతున్న కోవిడ్ పరీక్షలను ఈ దిగువ చిత్ర పటం చూపుతుంది. ఇప్పటివరకు 31 కోట్ల కొవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ కూడా స్వల్పంగా పెరిగి 7.72% అయింది.

రోజువారీ పాజిటివిటీ స్వల్పంగా తగ్గి 20.08% కు చేరటాన్ని ఈ చిత్రపటంలో చూడవచ్చు. .

గడిచిన 24 గంటలలో 3,43,144 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా 72.37% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 42,582 కొత్త కేసులు రాగా, కేరళలో 39,955, కర్నాటకలో 35,297 వచ్చాయి.

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.09% గా నమోదైంది. గత 24 గంటలలో 4,000 మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో పది రాష్టాలకు చెందినవారే 72.70% ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 850 మరణాలు నమోదు కాగా కర్నాటకలో 344 మంది కరోనాతో చనిపోయారు. .

