365 తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,జనవరి 27, హైదరాబాద్ :మున్నూరుకాపు (పటేల్స్ )ఐక్యతకోసం నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు “దశ-దిశ”ను నిర్దేశించేలా ఉండాలి అని సమ్మేళనంలో పలువురు కుల బందువులు ఉద్బోధించారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గ మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సుప్రజా గ్రూప్స్ అధినేత తూడి ప్రవీణ్ పటేల్ ,గాలి అనిల్ కుమార్ పటేల్ ,గచ్చి బౌలి కార్పోరేటర్ సాయిబాబా పటేల్ లు క్రిస్టల్ గార్డెన్ లో చేపట్టారు .కార్యమానికి తొలుత శేరిలింగంపల్లి కులబాంధవులు ,యువత ఈ సందర్భంగా సభాస్థలి వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

26జనవరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సభ స్థలి క్రిస్టల్ గార్డెన్ సభ స్థలిలో జాతీయజెండాను ఆవిష్కరించారు.ఆత్మీయ సమ్మేళనం జ్యోతి ప్రజ్వలన తో .మున్నూరుకాపు లిజెండ్స్ స్వర్గీయ పుంజాల శివశంకర్ ,బొజ్జం నర్సింలు చిత్ర పటాలకు పూలు జల్లి నివాళ్లు అర్పించి కార్యక్రమం మొదలు పెట్టారు.సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మన పేరు చివర “పటేల్ “అని పెట్టుకుంటే మన జనాభా సత్తా బయటపడుతుందని సూచిస్తూ నేటి నుంచే కార్యరూపం చేసుకుందామ్మన్నారు .తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సర్వేలో మున్నూరుకాపులు 18శాతం ఉన్నట్లు లెక్కలు తేల్చడం గమనార్హం .అయితే ! మనవాళ్ళ పేరు చివర రావు ,రెడ్డి ,నాయుడు ,పటేల్ ,కాపు అని పెట్టుకోవడంతో కుల గణనలో తేడా వచ్చిందన్నారు ఇంకా మన జనాభా మరో 6,7 శాతమైనా పెరిగేదన్నారు .

రాజకీయ కోణంలో కాకుండా కులైక్యత సాధన కోసం ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగింపు ముమ్మరం చేద్దాం అన్నారు .2023లో మున్నూరుకాపు బిడ్డ తెలంగాణ రాష్ట్ర సీఎం కావాలనే లక్ష్యంతో అందరూ పనిచేయాలని, యువత కూడా అందుకు సిద్ధంగా ఉండాలని అని వక్తలు పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో కులప్రముఖులు నర్సింగరావు పటేల్ ,కొండా దేవయ్య పటేల్ ,వద్దిరాజు రవి చంద్ర పటేల్ ,సి .విఠల్ పటేల్ ,రౌత్ కనకయ్య పటేల్ భువనగిరి కిషన్ పటేల్,సకినాల సుధాకర్ పటేల్, పిల్లి శ్రీనివాసు పటేల్ , సామల వేణు,పుటం పురుషోత్తం రావు పటేల్ ,ఆవుల శ్రీనివాస్ పటేల్ ,శ్రీరాముల ఉపేందర్ పటేల్, ఉగ్గె శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు