365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌,ఫిబ్రవరి 19,2025: మెగాస్టార్ చిరంజీవి సేవాతత్పరతకు మరోసారి మద్దతుగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ముందుకు వచ్చారు.

సినీ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసి తన అభిమానం చాటుకున్నారు. ఇది ఆయన రెండోసారి రక్తదానం కావడం విశేషం.

Read this also...Melody Brahma Mani Sharma Donates Blood at Chiranjeevi Blood Bank, Expresses Admiration for Megastar

Read this also...Anurag Mehrotra Appointed as Managing Director of JSW MG Motor India

Read this also...Campa Cola Partners with Noon Minutes for Exclusive UAE E-Commerce Distribution

చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్, రక్తదానం ద్వారా లక్షలాది మందికి ప్రాణదానం చేస్తూ, ఆపన్నహస్తంగా నిలుస్తోంది. మెగాస్టార్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు, సామాన్యులు సైతం ఈ మహత్కార్యంలో భాగమవుతున్నారు.

ఈ క్రమంలో మణిశర్మ కూడా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ, “ఎప్పటి నుంచో రక్తదానం చేయాలని భావిస్తున్నాను. నా సంగీతంతో చిరంజీవిగారికి అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయడం ద్వారా నా వంతు బాధ్యతను నెరవేర్చిన అనుభూతి కలుగుతోంది.

Read this also…Marico Innovation Foundation Celebrates 10th Edition of Indian Innovation Icons

Read this also…PURE EV Collaborates with JioThings to Transform the Smart Riding Experience

ఇది కూడా చదవండి…మార్చి 7న సోనీ లైవ్‌లోకి రాబోతోన్న రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’

లక్షలాది మంది ఇందులో భాగమయ్యారు. నేను కూడా ఒక చిన్న బొట్టుగా ఈ పుణ్యకార్యంలో చేరినందుకు ఆనందంగా ఉంది. మరెందరో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలకు మణిశర్మ తరచుగా మద్దతు పలుకుతుండగా, ఆయన రక్తదానం చర్య మరికొందరికి స్పూర్తిగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Twitter: https://x.com/Chiranjeevi_CT

YouTube: https://youtube.com/@chiranjeevi_ct