365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 11,2025: తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టిఎస్ఆర్డిఏ) ను ఇటీవల కొత్తగా నియమితులైన సీనియర్ రెసిడెంట్లతో పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మెడికల్ కాలేజీల్లో నియామకాలు పూర్తయ్యాక అసోసియేషన్ను మళ్లీ క్రియాశీలంగా రూపొందించారు.
ఇది కూడా చదవండి..హనుమాన్ జయంతి 2025: ముహూర్తం ఎప్పుడు..? పూజ ఎలా చేయాలి..?
Read this also…Swaraj Tractors Teams Up Again with MS Dhoni to Champion Farmers’ Prosperity
ఏప్రిల్ 9న డా. శ్రీనాథ్ (జిఎంసీ భూపాలపల్లి) టిఎస్ఆర్డిఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా డా. కరిష్ణి (గాంధీ మెడికల్ కాలేజ్) బాధ్యతలు చేపట్టనున్నారు.

డా. అఖిల్ (గాంధీ మెడికల్ కాలేజ్), డా. మోతే ప్రణయ్ (రిమ్స్ ఆదిలాబాద్), డా. అరుణ్ కుమార్ (జిఎంసీ ఖమ్మం), డా. పవన్ కల్యాణ్ (జిఎంసీ నిజామాబాద్) ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
డా. కౌశిక్ (జిఎంసీ మహబూబ్నగర్) అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
Read this also…Whirlpool Transforms Refrigeration with India’s Quickest Convertible Fridge-Now Converts in Just Over 10 Minutes!
Read this also…Connecting Respiratory Care: BreathefreeYatra Brings Nationwide Screening and Support to Patients
అనంతరం డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ, సీనియర్ రెసిడెంట్ల సమస్యలను ప్రభుత్వాధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే కార్యాచరణ చేపడతామని వారు హామీ ఇచ్చారు.