Mon. Jul 1st, 2024
nmc_365

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, ఏప్రిల్ 1, 2023: ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్, బాలీవుడ్, ప్రముఖ క్రీడాకారులు, ప్రముఖ రాజకీయాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఆమె కూతురు ఇషా అంబానీ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, “సాంస్కృతిక కేంద్రానికి లభిస్తున్న ఆదరణ చూసి నేను ముగ్ధురాలినయ్యాను. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ సాంస్కృతిక కేంద్రాలలో ఒకటి. కళలు, కళాకారులను స్వాగతీస్తున్నాం. ఇక్కడ చిన్న పట్టణాలు ,మారుమూల ప్రాంతాల యువత కూడా తమ కళను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శనలు సైతం ఇక్కడికి వస్తాయని ఆశిస్తున్నాను”అని నీతా అంబానీ అన్నారు.

nmc_365

ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ “ఇది ముంబైకి , దేశం మొత్తానికి ప్రధాన కళా కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. ఇక్కడ భారీ ప్రదర్శనలు నిర్వహించవచ్చు. భారతీయులు తమ పూర్తి కళాత్మకతతో అసలైన ప్రదర్శనలను రూపొందిస్తారని నేను ఆశిస్తున్నాను”. అని ఆయన పేర్కొన్నారు.

భారతరత్న సచిన్ టెండూల్కర్,ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, అథ్లెట్ దీపా మాలిక్ లు సెంటర్‌కు చేరుకుని కళాకారులను ఉత్సాహపరిచారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక్ చోప్రా, వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, అనుపమ్ ఖేర్, జావేద్ అక్తర్, షబానా అజ్మీ, సునీల్ శెట్టి, షాహిద్ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, దియా మీర్జా, శ్రద్ధా కపూర్, శ్రద్ధా కపూర్, రాజు హిరానీ, తుషార్ కపూర్ వంటి బాలీవుడ్ తారలు అందరినీ అలరించారు.