365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,యాదగిరిగుట్ట, జనవరి 29,2023: తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, కెసిఆర్ హయాంలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆదివారం ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, చరిత్రలో న భూతో న భవిష్యత్ అన్న చందంగా సీఎం కేసీఆర్ గారు యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించాలని చెప్పారు.
దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. కెసిఆర్ సీఎం ఐన తర్వాతే తెలంగాణ దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామిని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.