365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 20, 2025 : గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగులలో ఐదుగురిలో ముగ్గురు మాత్రమే సంవత్సరానికి ఒకసారైనా కార్డియాలజిస్ట్ను కలుస్తున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. కార్డియాలజిస్ట్ను క్రమం తప్పకుండా కలిసే రోగులలో మరణించే ప్రమాదం 24శాతం తగ్గుతుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
కార్డియాలజిస్ట్లు గుండె వైఫల్య రోగులను సంవత్సరానికి కనీసం ఒకసారైనా చూస్తే, 11-16 మంది రోగుల ప్రాణాలని కాపాడవచ్చని పరిశోధకులు తెలిపారు.

గత ఐదేళ్లలో గుండె వైఫల్యంతో బాధపడుతున్న ఆరు లక్షల మంది ఫ్రెంచ్ రోగులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. కార్డియాలజిస్ట్ను సంప్రదించిన రోగులు మరణించే అవకాశం తక్కువగా ఉంది. గత సంవత్సరం ఆసుపత్రిలో చేరిన రోగులకు, కార్డియాలజిస్ట్ లను నాలుగు అపాయింట్మెంట్లు తీసుకోవడం చాలా మంచిదని కనుగొన్నారు.