
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, మార్చి 9,2022: కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 351వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి దంపతులు బుధవారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.


హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.


ముందుగా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామివారికి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సుబుదేంద్రతీర్థ స్వామివారు అదనపు ఈవో దంపతులను ఆశీర్వదించారు.