PEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARYPEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARY
PEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARY
PEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARY

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమ‌ల‌,సెప్టెంబర్ 7,2021:తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం స్థాపించి 900 సంవత్సరాలు పూర్త‌యిన‌ సందర్భంగా శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో మంగ‌ళ‌వారం ఉద‌యం పెద్ద శాత్తుమొర, విశేష పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శ్రీశ్రీశ్రీ రామానుజులవారు తిరుమలలో పెద్ద జీయర్ మఠం స్థాపించిన విషయం విదితమే.

PEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARY
PEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARY

లోక క‌ల్యాణార్థం, క‌రోనా వ్యాధి మూడ‌వ వేవ్ వ్యాప్తి నివార‌ణ‌కు శ్రీ‌వారిని ప్రార్థిస్తూ శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆధ్వ‌ర్యంలో సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ నుంచి ఆళ్వారులు ర‌చించిన 4 వేల పాశురాల‌ను, రామానుజ నూత్తందాది, ఉప‌దేశ ర‌త్న‌మాల అఖండ పారాయ‌ణం నిర్వ‌హించారు.