Pedda-Sesha-Vahana-seva

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, జూన్ 11,2022: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాథుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు.

Pedda-Sesha-Vahana-seva

శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌యడిప్యూటీ ఈవో లోక‌నాథం, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, కంకణభట్టార్‌ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.