365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 10,2025: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న చానల్ జీ తెలుగు, 83 మిలియన్ల మంది ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువయ్యేందుకు గర్వపడుతోంది. ఈ పాఠక వర్గానికి మరింత దగ్గరగా ఉండేందుకు, జీ తెలుగు కొత్త బ్రాండ్ గుర్తింపుతో ‘ప్రేమతో.. జీ తెలుగు’ అనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, మనసుకు హత్తుకునే కథలు అద్భుతంగా ప్రతిబింబించబడ్డాయి.
‘మమతతోనే మాట మధురం’ అనే భావనతో రూపుదిద్దిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు ప్రజల సంస్కృతి, సమాజ సంబంధాలు, ఆత్మీయతల సమ్మేళనమే.
Read This also…ZEE Telugu Invites Viewers to Celebrate Togetherness with ‘Prematho Zee Telugu’
ఇది కూడా చదవండి…ఆయుష్ ఆర్ట్ అండ్ బులియన్ FY25లో ఆదాయం 1000% వృద్ధితో ఘన విజయం..
పశ్చిమ గోదావరి జిల్లా లోని ఒక గ్రామంలో సెట్టయిన ఈ బ్రాండ్ ఫిల్మ్, సంప్రదాయాల అనుసరణతో, తెలుగువారి లోగిలిలో జరిగే ఒక సంప్రదాయ పెళ్లి వేడుకను చూపిస్తుంది. తాటాకు పందిళ్లు, రంగవల్లి, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం వంటి సంప్రదాయ అంశాలతో ఘనంగా జరిపిన పెళ్లి వేడుక మనసును హత్తుకుంటుంది.

కూతురి వివాహానికి ముందే సైనికుడైన తండ్రి అనివార్య కారణాల వలన విధుల్లో చేరాల్సి వస్తుంది. అయినప్పటికీ, అతని గైర్హాజరీ లో కూడా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులు కలసి ఆ వేడుకను ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా జరిపారు. విధులు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తండ్రికి భార్య చెప్పిన మాట – “ఇంత పెద్ద కుటుంబం ఉండడం వల్లే పెళ్లి అంత వైభవంగా జరిగిందట” – ఈ సందేశాన్ని బలపరిచింది.
ఈ బ్రాండ్ ఫిల్మ్లో జీ తెలుగు సీరియల్ నటీనటులు జగద్ధాత్రి-కేదార్, అరుంధతి, భాగమతి, అమరేంద్ర, చామంతి-ప్రేమ్, ఆద్య-శ్రీను, రామలక్ష్మి-శౌర్య, భూమితో పాటు మరికొందరు నటీనటులు పాల్గొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాలను తాకుతుంది.
Read This also…Aayush Art and Bullion Ltd Reports Robust Growth in FY25 with Revenue Soaring 1000% to Rs 73.77 Crores
Read This also…Muthoot Finance Becomes First Kerala-Based Company to Cross ₹1 Lakh Crore Market Capitalization..
జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ,
“‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను జీవించి ప్రతిబింబించే ప్రయత్నం. తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరగా ఉండటమే మా లక్ష్యం. వివాహ పద్దతుల సౌందర్యాన్ని చూపించే ఈ బ్రాండ్ ఫిల్మ్ మన సంస్కృతి, విలువలను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం రీబ్రాండింగ్ కాదు, ప్రేక్షకులతో మాకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నం. భవిష్యత్తులో కూడా తెలుగు ప్రేక్షకులు జీ తెలుగు ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.”
ఈ బ్రాండ్ ఫిల్మ్ భారతదేశంలోనే మొదటిసారిగా ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో రూపొందించిన బహుభాషా సిరీస్లో భాగంగా 23వ జీ సినీ అవార్డ్స్ సందర్భంగా జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్,డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒకేసారి ప్రసారం అయ్యింది.
ప్రముఖ గాయకులు రేవంత్, జయశ్రీ ఆలపించిన ‘Sandadi Sandadi’ పాట తెలుగువారి అనుబంధం, ప్రేమ, ఆప్యాయతను పటిష్టం చేస్తుంది.
‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్ అన్ని ప్రసారాలలో, డిజిటల్ ఫ్లాట్ఫామ్లలో కొనసాగుతోంది. ఈ క్యాంపెయిన్లో జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం, చామంతి, ఘరానా మొగుడు, పడమటి సంధ్యారాగం, ముక్కుపుడక వంటి సీరియల్స్,పలువురు నటీనటులు పాల్గొన్నారు. జీ తెలుగు కేవలం వినోదం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పంచే ఛానల్గా కొనసాగుతుందని ఈ క్యాంపెయిన్ మరోసారి నిరూపించింది.