365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 10,2025: వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి చిత్రమే ‘ప్రేమకు జై’. గ్రామీణ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 11 (శుక్రవారం) థియేటర్లలో సందడి చేయనుంది.
అనిల్ బురగాని, జ్వలిత హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించారు. అనసూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెరపై ఇదివరకు చూడని ప్రేమకథను అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ, “ఒక గ్రామంలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దాం. అనిల్ బురగాని, జ్వలిత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టీమ్ కృషి, నిర్మాత అనసూర్య సహకారంతో చిత్రం అద్భుతంగా వచ్చింది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు. శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
ఈ చిత్రంలో అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటిస్తుండగా, దుబ్బాక భాస్కర్ విలన్గా కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో ఎడిటర్గా సామ్రాట్, సినిమాటోగ్రాఫర్గా ఉరుకుందా రెడ్డి, సంగీత దర్శకుడిగా చైతు పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం. రాజేష్, సహ నిర్మాత మైలవరం రాజు, నిర్మాతగా అనసూర్య బాధ్యతలు నిర్వహించారు. కథ, దర్శకత్వం శ్రీనివాస్ మల్లం సొంతం.