365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే 10,2024: తిరుపతిలో మే 12వ తేదీన శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. మే 11వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుంది.

మే 12న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.
అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5 నుంచి13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
Also read: JIO INTRODUCES THE ULTIMATE OTT STREAMING PLAN @ ₹ 888/ MONTH..
Also read: Mega Star Chiranjeevi on Padma Vibhushan and Campaigning for Pawan Kalyan
Also read: MG celebrates its centenary year; launches ‘100-Year Limited Edition’ in India.
Also read: MSDE sign MOU for flagship Drone Didi Yojana; skilling women to become drone pilots
Also read: Bank of India Signs MOU with Indian Coast Guard for BOI Rakshak Package
ఇది కూడా చదవండి: మేధావి మౌనం వీడు :ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
Also read: Akshay Tritiya Parna Mahotsav held
ఇది కూడా చదవండి: ఎంఎస్ ధోనీతో టార్గెట్ 630 కోసం ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించిన స్వరాజ్
Also read:Swaraj Unveils new campaign for Target 630 featuring MS Dhoni
Also read: Surpassed ₹ 180 Bn in Revenues Highest Ever Yearly & Quarterly Revenue & Profitability
ఇది కూడా చదవండి: పింఛన్లు, ఇన్పుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు డీబీటీ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని బాబు కంప్లైంట్..