Sajjala Ramakrishna Reddy

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి,ఆగస్టు 2, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండి యూరో సింక్రనైజేషన్ స్కిల్ క్లస్టర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఫెస్టో ఎక్స్‌పోటైనర్’ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు.

Sajjala Ramakrishna Reddy

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫెస్టో ఎక్స్‌పోటైనర్‌ వాహనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం రాబోతోందని అంటున్నారు. కానీ అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని, చదువుపై ఆసక్తి, చదువుకోవాలనే ఆశ ఉన్నవారికి ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించిందని అన్నారు.

Sajjala Ramakrishna Reddy

సజ్జల మాట్లాడుతూ ఈ దేశంలో ఎవరూ చేయని విద్యావ్యవస్థలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని, ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోందని, విద్యార్థులు ఫెస్టో ఎక్స్‌పోటైనర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్ రెడ్డి, SD&T ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు సత్యనారాయణ, MD APSSDC, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ పాల్గొన్నారు.