365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్‌, మార్చి 17,2025: బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీ ప‌రిధిలోని కిస్మ‌త్‌పురాలో రహదారి వివాదానికి హైడ్రా తుది పరిష్కారం చూపింది. రెండు కాలనీల మధ్య అడ్డుగా నిర్మించిన గోడను సోమ‌వారం ఉద‌యం తొలగించి, సాయంత్రానికల్లా సీసీ రోడ్డు వేయించ‌డ‌ంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం బండ్ల‌గూడ జాగీర్‌లోని ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ – శ్రీ హ‌ర్షిత్ లే ఔట్‌ల మ‌ధ్య 30 అడుగుల వెడల్పుతో రహదారి ఉంది. గ‌తంలో ఇళ్ల నిర్మాణ దశలో లేఔట్ల‌ భద్రత పేరుతో కొందరు రహదారికి అడ్డంగా గోడ నిర్మించారు.

ఇది కూడా చదవండివేన్ స్టేట్ యూనివర్సిటీతో ఒప్పందం… ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కెఎల్ యూనివర్సిటీ

ఇది కూడా చదవండి…టీబీ పేషెంట్స్ కు ఫ్రీగా పౌష్టికాహారం..

మున్సిప‌ల్ అధికారులు ఆరు నెలల క్రితం దానిని తొలగించినా, మళ్లీ శ్రీ హ‌ర్షిత్ లే ఔట్ యజమానులు గోడను నిర్మించడంతో సమస్య మళ్లీ చెలరేగింది.

రహదారి మూసివేతతో దాదాపు మూడు ఏళ్లుగా స్థానికులు అవస్థలు పడుతున్నట్లు ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన హైడ్రా, మున్సిప‌ల్ అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం గోడను పూర్తిగా తొలగించింది. అదేరోజు సాయంత్రానికి బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీ సీసీ రోడ్డు వేయించడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

Read this also…India’s Growing Global Influence in 2025..

Read this also…The World’s 10 Most Powerful Countries in 2025: India’s Rising Influence

‘‘మూడేళ్లుగా 2 కిలోమీట‌ర్ల పాటు అదనపు ప్రయాణం చేసేవాళ్లం. ఇప్పుడు రహదారి తెరుచుకోవడంతో మాకు రాహతం లభించింది’’ అని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించిన హైడ్రాకు, తక్షణమే స్పందించి రోడ్డు వేయించిన మున్సిపాలిటీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.