365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో శుక్రవారం సరస్వతీ మాత విగ్రహాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ. చ. విద్యాసాగర్ ఆవిష్కరించారు.

రిటైర్డ్ ప్రొఫెసర్ రాచా బత్తుల శ్రీహరిబాబు దంపతులు అందించిన సహకారంతో ఈ విగ్రహాన్ని నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో ప్రతిష్టించారు.

ఇది కూడా చదవండి…స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి దివ్యజ్ఞాన పరిచయం(170 వ జన్మోత్సవ ప్రత్యేకం)

ఇది కూడా చదవండి…భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత: పేలుళ్ల పరిస్థితిని సమీక్షించనున్న జమ్మూసీఎం ఒమర్ అబ్దుల్లా..

నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లోని ప్రధాన ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహం వద్ద శ్రీహరి బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ విగ్రహ ఏర్పాటుకు సహాయం చేసిన శ్రీహరి బాబు దంపతులను రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, విశ్వవిద్యాలయ గ్రంథ పాలకుడు డాక్టర్ వివేక వర్ధన్, సహాయ గ్రంథ పాలకుడు డాక్టర్ ఎన్. పి. రవికుమార్‌తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఎంతో ఘనంగా సత్కరించారు.

This is also read.. Lakshmi’s Salon & Academy Launches Its First Branch at RK Puram, Kothapet

This is also read.. Wonderla Celebrates Mother’s Day with Free Entry for Moms, Invites Families to Make Memories Together

ఈ కార్యక్రమంలో నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ కేంద్రం ఉద్యోగులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.