365 తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్,మార్చి 25, 2021: భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తన సీఎస్ఆర్ చర్యల్లో భాగంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్కు చేయూత అందించాలని నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని తక్కువ ఆదాయ వర్గాలకు రెండు పర్యాయాల కొవిడ్-19 వ్యాక్సిన్ ఖరీదును భరించనుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ చర్య ద్వారా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, రాయగఢ్, పాల్ఘార్, జల్గావ్, లాతూర్. అహ్మద్నగర్, యవత్మాల్, చంద్రాపూర్ ఉపజిల్లాలు, ముంబయి శివారు ప్రాంతాలు, పుణె శివారు ప్రాంతాలు, నాగ్పూర్ శివారు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి (విజయవాడ ప్రాంతం)లో సీనియర్ సిటిజన్లు, ఇతర అనారోగ్యాలు కలిగిన 37,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

“అణగారిన వర్గాలు, ముప్పు కలిగిన ప్రజలకు సుస్థిరమైన చేయూత అందించి వారి జీవితాల్లో మార్పులు తేవాలన్నది ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా కొవిడ్-19 టీకా ఉద్యమంలో సమాజంలో అణగారిన వర్గాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా రెండు వ్యాక్సిన్లు వేసుకునేలా చూస్తూ ప్రభుత్వానికి చేయూత అందించే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైన ప్రజలు వీలైనంత తొందరగా వ్యాక్సిన్ వేసుకునేలా చూస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ చర్య దోహదపడుతుందని మేము భావిస్తున్నాం” అన్నారు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ పి.సి.కందపాల్వ్యాక్సినేషన్ లో భాగంగా అల్పాదాయ వర్గాల జనాభా ప్రయోజనం పొందేందుకు ఈ చర్య మరింత దోహదపడుతుంది. మహమ్మారి తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటూ ఈ కష్టకాలంలో సమాజానికి చేయూత అందించేందుకు కొవిడ్-19 టీకా వేసుకునే ప్రజల సంఖ్య ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పెంచేందుకు ముందుకు వచ్చిన మొట్టమొదటి కార్పొరేట్ సంస్థ్లలో ఒకటి ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్.