365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. మండలంలో ఆయన చదువుకుంటున్న పాఠశాలలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో బాలుడికి చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే, పొగ మితిమీరిన కారణంగా శ్వాసకోశాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి...మచ్చబొల్లారంలో చెత్త డంపింగ్‌పై స్పందించిన హైడ్రా కమిషనర్..

Read this also…CPawan Kalyan Orders Probe into JEE Students’ Delay Allegations

ఈ ఘటన సమాచారం అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌కు అందింది. వెంటనే పర్యటనను మధ్యలోనే నిలిపేయాలని అధికారులు, నేతలు సూచించారు.

అయితే, ‘‘అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని గిరిజనులకు నిన్నే హామీ ఇచ్చాను. వారు ఎదురుచూస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని, అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాతే వెళ్లుతాను’’ అని ఆయన తెలిపారు.

Read this also…Pawan Kalyan to Travel to Singapore After Son Injured in School Fire

Read this also…CIEU Think Tank Urges Affordable Cancer Treatment Through Wider Adoption of Biosimilars in India

అనంతరం విశాఖ చేరుకుని అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి.