Mon. Jul 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 22 మే 2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనం అందించేందుకు రేపు రాజేంద్రనగర్ లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నట్లు పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు.

ఈ మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు IIOR, IIMR, IIRR, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖలు (TSSDC, NSC, TSSOCA) పాల్గొంటున్నాయన్నారు.

అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, (జగిత్యాల, పాలెం, వరంగల్), వ్యవసాయ పరిశోధనా స్థానాలు అలాగే విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ విత్తనమేళ ఉదయం10 గంటలకు ప్రారంభం కానుంది.

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందించిన జీవన ఎరువులు ,చీడపీడల నివారణలో వాడే పరాన్న జీవులు మొదలైనవి రైతుల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే విత్తనమేళాల్లో 16 పంటలలో 67 రకాలకు సంబంధించి దాదాపు 12 వేల క్వింటాళ్ళ విత్తనాలను రైతులు కొనుక్కోవడానికి అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు.

ఈ సీడ్ మేళాలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్ఠి ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించటానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలతో కూడిన వ్యవసాయ ప్రదర్శన కూడా అదే రోజున నిర్వహిస్తున్నారు.

కావున రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విత్తన మేళా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామిరెడ్డి కోరారు.

ఈ మేళాలో..

ఈ విత్తన మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందించిన వివిధ వంగడాలు అనగా వరిలో సన్నగింజ రకాలు (19 రకాలు) బి.పి.టి. 5204, డబ్ల్యు.జి.ఎల్-44, డబ్ల్యు, జి.ఎల్ -962, డబ్ల్యు.జి.ఎల్. 1119, డబ్ల్యు.జి.ఎల్.1246, డబ్ల్యు.జి.ఎల్ 1487, ఆర్.డి.ఆర్ 1162, ఆర్.డి.ఆర్ 1200, కె.ఎన్.ఎమ్ 1638, కె.పి.ఎస్. 6251, జె.జి.ఎల్- 28545, జె.జి.ఎల్ 27356, జె.జి.ఎల్ 33124, ఆర్.ఎన్.ఆర్. 15435, ఆర్.ఎన్.ఆర్- 2465, ఆర్.ఎన్.ఆర్- 11718, ఆర్.ఎన్.ఆర్. 21278, ఆర్.ఎన్.ఆర్. 29325, ఆర్.ఎన్.ఆర్. 15048 దొడ్డు గింజ రకాలు (8 రకాలు), ఆర్.ఎన్.ఆర్ 28361, ఆర్.ఎన్.ఆర్. 15459, కె,ఎన్.ఎమ్ 118, ఎమ్.టి.యు 1010, డబ్ల్యు.జి.ఎల్- 915, జె.జి.ఎల్ 24423, జె.జి.ఎల్ 28639, సువాసన కలిగిన రకం (1) ఆర్.ఎన్.ఆర్-2465, మొక్కజొన్నలో (5 హైబ్రిడ్స్) డి.హెచ్.యం 117, డి. హెచ్.యం 121, బి.పి.సి. హెచ్. 6, కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క-1, జొన్నలో (2 రకాలు) పి.వై.పి.ఎస్-2, సి.ఎస్.వి-41, రాగిలో (1) పి.ఆర్.ఎస్. 38, ఆముదం లో (1 రకం) పి.సి.హెచ్. 111, నువ్వులు ( 1 రకం) జె.జి.యస్-1020, వేరుశనగ లో (1 రకం) ధరణి విత్తనాలను అందుబాటులో వుంచడం జరుగుతుంది.

అపరాల పంటలైన పెసరలో (4 రకాలు) డబ్ల్యు.జి.జి 42, ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి 347, ఎమ్.జి.జి 385, మినుములో (1 రకం) యం.బి.జి. 1070, కందిలో (8 రకాలు) హనుమ, డబ్ల్యు.ఆర్. జి.ఇ- 97, డబ్ల్యు.ఆర్. జి.ఇ-93, డబ్ల్యు.ఆర్. జి.ఇ-121, డబ్ల్యు.ఆర్. జి.ఇ-255, పి. ఆర్. జి-176, టి.డి.ఆర్.జి-59, ఆశ సోయాచిక్కుడులో (4 రకాలు) బాసర, కె.డి.ఎస్-726, ఎం.ఎ.యు.యస్-612, ఎ.ఐ.ఎస్.బి-50,పశుగ్రాస పంటల విత్తనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.