365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, జూన్ 7, 2025: విధి నిర్వహణలో ఉన్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళా సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) హరితతో దురుసుగా ప్రవర్తించి, దాడి చేసిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం:
తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావుతో పాటు మరికొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు పట్టణంలోని ఎన్ఎస్పి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న చౌదరి హోటల్ వద్ద గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై క్రైమ్ నంబర్ 102/2025 U/s 329(4), 296(b), 79, 189 (2) r/w 190 BNS కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి…ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది ‘విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా దర్శనంఅంగరంగ వైభవంగా కర్ర పూజ క్రతువు ప్రారంభం..
Read This also…Khairatabad Ganesh This Year to Be ‘Sri Vishwashanti Mahashakti Ganapathi’..
ఈ కేసు విచారణ నిమిత్తం ఎస్సై ఘటనా స్థలానికి వెళ్తున్నారని తెలుసుకున్న రాయల రామారావు @ రాము, తన అనుచరులతో కలిసి తిరిగి హోటల్ వద్దకు వచ్చాడు. సాక్షులుగా ఉన్న హోటల్ సిబ్బందిని, యజమానిని తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ఇబ్బందులకు గురిచేస్తానని, హోటల్ నడవనివ్వనని బెదిరిస్తూ, హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ సృష్టిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఎస్సై తన పోలీస్ సిబ్బందితో కలిసి హోటల్ వద్దకు వెళ్ళగా, ఆమె ఎదురుగానే రాయల రామారావు @ రాము, అతని అనుచరులు మద్యం మత్తులో గొడవ చేస్తున్నారు. వారిని అక్కడి నుండి పంపించి కేసు విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్సై వారిని పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, రాయల రామారావు @ రాము అతని అనుచరులు డ్యూటీలో ఉన్న మహిళా అధికారి విధులకు ఆటంకపరుస్తూ దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారని కమిషనర్ తెలిపారు.
Read This also…TransUnion CIBIL and Sa-Dhan Collaborate to Launch Nationwide Credit Awareness Program..
Read This also…NSE Sustainability Ratings and Analytics Ltd Launches ESG Ratings for Listed Companies..
ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్సై ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U/s 74, 189, 191 (2), 195, 132, 351(2) r/w 190 BNS, Section 7 (1) కింద మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం పది మందిపై కేసులు నమోదు కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. గతంలో కూడా రాయల రామారావుపై తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని ఆయన తెలిపారు.