365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హాంబర్గ్, మార్చి10,2023: జర్మనీలోని హాంబర్గ్ నగరంలోని ఓ చర్చిలో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆల్స్టర్డార్ఫ్ ప్రాంతంలోని యెహోవాసాక్షి చర్చిలో కాల్పులు జరిగినట్లు హాంబర్గ్ పోలీసులు ఒక ట్వీట్లో తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని హాంబర్గ్ పోలీసులు ట్వీట్ చేశారు.
డీల్బోగ్ స్ట్రీట్లోని చర్చిలో కాల్పులు జరిగాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, గ్రాస్ బోర్స్టెల్ జిల్లాలోని డెల్బోగ్ స్ట్రీట్లోని చర్చిలో కాల్పులు జరిగాయని పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా..ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు.

ప్రాథమిక విచారణ ప్రకారం గ్రాస్ బోర్స్టెల్ జిల్లాలోని డెల్బోగ్ స్ట్రీట్లోని విట్నెస్ చర్చిలో కాల్పులు జరిగాయని పోలీసులు ట్వీట్ చేశారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేసథ్యంలో సమీపంలో నివసిస్తున్న వారిని తమ ఇళ్లను విడిచిపెట్టవద్దని హెచ్చరించారు.
దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి కూడా ఉన్నాడా..? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని ఆయన అన్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దాడిలో ఎంత మంది మరణించారనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దుండగుడు 12 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత కాల్పుల ఘటనపై పోలీసులకు సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా పలువురు తీవ్రంగా గాయపడగా మరికొందరు మృతి చెందారు.
పోలీసులు వచ్చే వరకు కూడా పైనుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని సాక్షులు చెబుతున్నారు. పోలీసు అధికారులు పైకి వెళ్లి చూడగా మరో వ్యక్తి శవమై కనిపించాడు.