365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, 27 అక్టోబర్, 2024: అక్టోబర్ నాల్గవ శనివారా న్ని ప్రతి సంవత్సరం సికెల్ సెల్ అవగాహన దినంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా, తలసేమియా అండ్ సికెల్ సెల్ సొసైటీ (టిఎస్‌సిఎస్‌) తమ శివారంపల్లి ప్రాంగణంలో అవగాహన కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో సికెల్ సెల్ వ్యాధి బాధితులు ఎదుర్కొనే సైకాలాజికల్, సామాజిక సమస్యలపై డాక్టర్ అజ్రా ఫాతిమా (క్లినికల్ సైకాలజిస్ట్) ముఖ్యంగా చర్చించారు. దాదాపు 150 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, అంగీకారం, శ్వాస వ్యాయామాలు, ధ్యానం, సానుకూల ఆలోచనలు వంటి అంశాలపై విలువైన జ్ఞానం పొందారు.

చంద్రకాంత్ అగర్వాల్, డాక్టర్ సుమన్ జైన్, శ్రీమతి అనితా ఉపాధ్యాయ, శ్రీమతి ప్రియదర్శిని తదితరులు స్ఫూర్తిదాయక ప్రసంగాలతో సికెల్ సెల్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ఒపి సేవలు, వ్యాక్సినేషన్, రోగులకు అవసరమైన మందుల పంపిణీ చేశారు.