365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఫిబ్రవరి 28,2022: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఏడో రోజు రాత్రి స్వామివారు అశ్వ వాహనం అధిష్టించి తనవేగశక్తి, బలశక్తి నిరూపిస్తుంటారు. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియంత్రిస్తున్నాడు.