365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఈ జనవరి నెలలో పలు ముఖ్యమైన ఉత్సవాలు నిర్వహించబడనున్నాయి. వాటి వివరాలు:
- జనవరి 4, 11, 18, 25 తేదీలలో శనివార సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవ నిర్వహించబడతాయి.
- జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి.
- జనవరి 13న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8:30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించబడుతుంది.
- జనవరి 14న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది.
- జనవరి 29న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.