365తెలుగు ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి, ఫిబ్ర‌వ‌రి 12, 2022: శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా మూడ‌వ‌ రోజైన శ‌నివారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆల‌య ప్రాంగ‌ణంలో తిరుచ్చిపై విహరించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు.

కాగా నాలుగో రోజైన ఫిబ్ర‌వ‌రి 13న శ్రీ కృష్ణ‌స్వామివారు, శ్రీఆండాళ్ అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.ఈ కార్య‌క్రమంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో ర‌వికుమార్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ఎపి. శ్రీ‌నివాస దీక్షితులు, సూపప‌రింటెండెంట్లు నారాయ‌ణ‌, వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ కామ‌రాజుపాల్గొన్నారు.