Sri-Prasanna-Venkateswaraswamy

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జూన్‌ 15,2022: అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలం గా వాహనసేవ జరిగింది.

హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవను భక్తులు వీక్షించి స్వామికృపకు పాత్రులయ్యా రు.