
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూన్ 21, 2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు శ్రీ కోదండరామస్వామివారి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై కటాక్షించారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి తన శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుంచి మోక్షాన్ని పొందుతారని స్వామివారు ఈ వాహనం ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు.