
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే 6,2022: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా మే 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్రం భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
