365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్2, 2025, హైదరాబాద్/చెన్నై: SSPL చైర్మన్ నవాబ్‌జాదా మహ్మద్ ఆసిఫ్ అలీ, సెలబ్రిటీ ప్యాట్రన్ రవి మోహన్, CEO & డైరెక్టర్ ఎల్.టి. ఆనంద్ ఆధ్వర్యంలో SSPL ను అత్యంత వైభవంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, VIPలు హాజరయ్యారు. వేడుకలో 5 అడుగుల ఎత్తైన ట్రోఫీ ఆవిష్కరించబడింది, అలాగే లీగ్ అధికారిక లోగో మరియు ఉత్సాహభరితమైన SSPL యాంతమ్ విడుదలచేయడం జరిగింది.

Read This also…SSPL Grand Launch: South India’s Biggest Tennis Ball Cricket League..

ఇది కూడా చదవండి…టొవినో థామస్ ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకులని కట్టిపడేసిన “నరివెట్ట” చిత్రం..!

ఇది కూడా చదవండి…నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 లక్ష్యాలను సాధించేలా యూనివర్సిటీలకు చేయూతనిస్తున్న NIAT

భారతదేశంలో ప్రతీ బాలుడికీ క్రికెట్ జీవితంలో ఒక భాగం. చాలా మంది తమ క్రికెట్ ప్రస్థానాన్ని టెన్నిస్ బాల్ క్రికెట్ తో ప్రారంభిస్తారు. క్రికెట్ అంటే భారతీయులకెక్కడైనా కేవలం ఆట మాత్రమే కాదు – ఇది భాషలు, ప్రాంతాలు, సంస్కృతుల మధ్య ప్రజలను ఏకం చేసే ఓ మతం వంటిది.

వీధుల్లోని చిన్న చిన్న ఆటల్లోనే ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్‌లు ఎదిగారు. ఈ స్ఫూర్తిని ప్రేరణగా తీసుకుని SSPL వీధి క్రికెట్‌ను ప్రొఫెషనల్ స్థాయిలో ఒక వేదికగా తీర్చిదిద్దుతోంది.