365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 6, 2025:హస్మత్పేట చెరువు నుంచి ప్రవహించే పట్నీ నాలా పై అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తూ మున్సిపల్ పరిపాలనలో కీలక ముందడుగు వేశారు. నాలా ఒడ్డున వాణిజ్య కట్టడాలు, నివాస గృహాలు నిర్మించి దాదాపు 70 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాను 15–18 అడుగుల మేరకు కుదించారని అధికారుల నిర్ధారణ.
ఈ ఆక్రమణల వల్ల పాయిగ కాలనీ, పట్నీ కాంపౌండ్, పట్నీ కాలనీ, విమాననగర్, BHEL కాలనీ, ఇందిరమ్మ నగర్ ప్రాంతాలు వర్షాల సమయంలో ముంపునకు గురవుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కంటోన్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వాపోయారు.
Read This also…TransUnion CIBIL and Sa-Dhan Collaborate to Launch Nationwide Credit Awareness Program..
Read This also…NSE Sustainability Ratings and Analytics Ltd Launches ESG Ratings for Listed Companies..
ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ GHMC, ఇరిగేషన్ శాఖ, కంటోన్మెంట్ అధికారులతో కలసి గురువారం పరిశీలన చేశారు. స్థానికులు గత ముంపు దృశ్యాలను సెల్ఫోన్లలో చూపిస్తూ బాధలు వివరించారు.

వెనువెంటనే అధికారులు నిర్ణయం తీసుకుని, శుక్రవారం ఉదయం నుంచి నాలా ఆక్రమణల తొలగింపును ప్రారంభించారు. స్థానికులు దీన్ని ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. “దశాబ్దాల నరకానికి ఇప్పుడు విముక్తి లభించింది” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడంపై కూడా హర్షం వ్యక్తం చేశారు. “GHMC చేస్తుందా, కంటోన్మెంట్ చేస్తుందా?” అనే సందేహాలను పక్కనబెట్టి హైడ్రా అధికారుల సాహసోపేతమైన చర్యలు ప్రజల్లో విశ్వాసం కలిగించాయి.
పదేళ్లుగా వరద ముప్పులో ఉన్న దాదాపు 30 వేల కుటుంబాలకు ఇప్పుడు ఊరటనిచ్చిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వర్షం పడితే తమ నివాసాలు నీట మునిగే భయం నుంచి బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
Read This also…RCB vs PBKS Face Off in IPL 2025 Final Tonight..
ఇది కూడా చదవండి…హ్యుందాయ్ కొత్త ప్రచారం: పంకజ్ త్రిపాఠి తో ‘లిజన్ టు యువర్ దిల్ ఆర్ ది డీల్స్’..
అనంతరం, నాలా భవిష్యత్లో మరలా ఆక్రమణలకు గురికాకుండా హద్దులు నిర్ణయించి, రెండువైపులా ప్రహరీలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్థంగా నిర్వహణ చేస్తున్నారు. ఈ చర్యల్లో GHMC, కంటోన్మెంట్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొంటున్నారు.