365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 19,2025: ZEE5 మరో విభిన్నమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తోంది. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఈ ఉత్కంఠభరితమైన వెబ్‌సిరీస్‌ను దర్శకుడు కృష్ణ పోలూరు తెరకెక్కించగా, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీరామ్ నిర్మించారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 27 నుండి ZEE5లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా, ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

ట్రైలర్ లింక్: https://youtu.be/TYU8OwKM-mk
ప్రెస్ మీట్ లైవ్: https://youtu.be/sQWoUBanW9M

ఇవే ట్రైలర్ లాంచ్ వేళ పలుకులు

నవీన్ చంద్ర మాట్లాడుతూ –
“విరాటపాలెం పోస్టర్ చూసినప్పుడే ఆసక్తి కలిగింది. ‘రెక్కీ’ నా ఫేవరెట్ సిరీస్. అదే దర్శకుడు ‘విరాటపాలెం’ తీస్తున్నారని తెలియగానే ఇంకా ఎగ్జైట్ అయ్యాను. అభిజ్ఞ పాత్రకు న్యాయం చేస్తారు. ఈ ట్రైలర్ మూడ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా విజయవంతం అవుతుంది” అని చెప్పారు.

నిర్మాత శ్రీరామ్
“రెక్కీ తర్వాత చాలానే కథలు విన్నా, కానీ దివ్య గారు చెప్పిన ఈ కథనే నన్ను వెంటాడింది. జీ5కు ఈ కథను తీసుకెళ్లడంలో అనురాధ మేడం పెద్ద సహకారం అందించారు. అభిజ్ఞ, కృష్ణ గారు తమ పనితీరు ద్వారా ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. 80ల కాలం అద్భుతంగా ప్రతిబింబించబడింది” అన్నారు.

దర్శకుడు కృష్ణ పోలూరు
“రెక్కీ తర్వాత మళ్లీ ZEE5తో పని చేయడం గర్వంగా ఉంది. విరాటపాలెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కథకు సరిగ్గా సరిపోయే విజన్‌తో పనిచేశాం” అని తెలిపారు.

నాయిక అభిజ్ఞ వూతలూరు
“మూఢనమ్మకాలపై పోరాడే మహిళ పాత్ర చేయడం చాలా ప్రత్యేక అనుభూతి. దివ్య గారు రాసిన కథలో బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. శ్రీరామ్ గారు నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు. ZEE5 మాదిరి ప్లాట్‌ఫాంపై అలాంటి కంటెంట్ రావడం హర్షణీయం” అన్నారు.

Read This also…Viraatapalem Trailer Unveiled by Naveen Chandra

ఇది కూడా చదవండి…జూలై 4 నుంచిస్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్న “ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు” – సోనీ లివ్‌లో!

చరణ్ లక్కరాజు
“ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణ గారితో పని చేయడం ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. అభిజ్ఞతో స్క్రీన్ షేర్ చేయడం చాలా బాగుంది” అన్నారు.

కెమెరామెన్ మహేష్ స్వరూప్
“రెక్కీ తర్వాత మళ్లీ బలమైన కథతో రాబోతున్నాం. విజువల్ టోన్, థీమ్ అద్భుతంగా ఉండబోతుంది” అన్నారు.

కథా రచయిత దివ్య
“ఇది నా తొలి వెబ్‌సిరీస్ ప్రాజెక్ట్. ఇది 80ల కాలంలో జరగడం విశేషం అయినా ఇప్పటికీ రీలవెంట్‌గా అనిపిస్తుంది. మూఢనమ్మకాలు ఎలా సమాజాన్ని ప్రభావితం చేస్తాయో చూపించబోతున్నాం” అన్నారు.

ZEE5 కంటెంట్ హెడ్ సాయి తేజ్
“రెక్కీ ZEE5లో టాప్ హిట్. విరాటపాలెం ఆ స్థాయిని అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీగా కూడా తీసుకురావాలని భావిస్తున్నాం. అభిజ్ఞ నటన, దివ్య కథ, కృష్ణ గారి విజన్ – ఇవన్నీ కలిసి సిరీస్‌ను బలంగా తీర్చిదిద్దాయి. ఇది ఫ్యామిలీతో బింజ్‌ వాచ్ చేయదగ్గ కంటెంట్” అన్నారు.

Read This also…The Hunt: The Rajiv Gandhi Assassination Case comes alive, streaming from 4th July on Sony LIV!

Read This also…ZEE5 Unveils ‘Viraatapalem: PC Meena Reporting’ – A Gripping Telugu Supernatural Thriller Premiering June 27

ప్రేక్షకులకు సూచన

‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ – మూఢనమ్మకాలపై ప్రశ్నలే గుబురుగా మారే కథను మీరు మిస్ అవకండి! జూన్ 27 నుంచి ZEE5లో మాత్రమే స్ట్రీమింగ్‌.