365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 26,2026 : వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు పద్మశ్రీ పురస్కారాలను కైవసం చేసుకోగా, క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి ‘పద్మభూషణ్’ దక్కింది.

తెలంగాణ నుంచి పురస్కారాలు పొందిన వారిలో అత్యధికులు వైద్య, శాస్త్రవేత్తలే కావడం విశేషం. వారి విశేషాలు ఇవే..
డాక్టర్ గుడురు వెంకటరావు (గ్యాస్ట్రోఎంటరాలజీ).. ఏఐజీ (AIG) ఆసుపత్రికి చెందిన ఈయన 12 వేలకు పైగా శస్త్రచికిత్సలు, 16 వేలకు పైగా ఎండోస్కోపీలు నిర్వహించారు. ‘ట్రాన్స్-ఓరల్ ఎండోస్కోపిక్ అపెండిెక్టమీ’ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
చంద్రమౌళి గడమనుగు (ఏరోస్పేస్)..ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
దీపికా రెడ్డి (కళలు)..కూచిపూడి నృత్య రంగంలో విశేష సేవలు.
కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్..మెటీరియల్ సైంటిస్ట్గా అంతరిక్ష, రక్షణ రంగాల్లో పరిశోధనలు.
Read this also..Prasad and World Sound & Vision Launch GCC’s Largest Film Restoration Centre in Riyadh..
Read this also..Flipkart Unveils ‘Crafted by Bharat’ Sale for Republic Day..
గుర్తింపు పొందిన ‘అనామక’ యోధులు..
దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా సేవలందిస్తున్న 45 మంది ‘అన్సంగ్ హీరోస్’ను పద్మశ్రీ వరించింది. వీరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత యాక్సెస్ లైబ్రరీని స్థాపించిన ఒక మాజీ బస్ కండక్టర్ కూడా ఉండటం విశేషం.
వాయుసేన అధికారికి అశోక చక్ర..
అంతరిక్ష ప్రయాణం చేయనున్న రెండో భారతీయుడిగా గుర్తింపు పొందిన ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దేశ అత్యున్నత శాంతి సమయ శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’ లభించింది.
