
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుపతి, ఆగస్టు6, 2021 : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 9వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు.

కొత్తవి,ఉపయోగించిన,పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 19 లాట్లు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్సైట్ www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.