365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 10 2025:నేపాల్లో రాజకీయ సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా ‘జెన్-జెడ్’ యువత ఇంటర్నెట్ నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో నిరసనకారులు జైలుపై దాడి చేసి ఖైదీలను విడిపించినట్లు సమాచారం.
భారత్-నేపాల్ సరిహద్దులో భద్రత పెంపు..
కపిల్వస్తు జైలు నుంచి ఏకంగా 459 మంది ఖైదీలు పారిపోవడంతో భారత్లోకి చొరబడే అవకాశం ఉందని భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని సరిహద్దు భద్రతా దళం (SSB) గస్తీని ముమ్మరం చేసింది.
అంబాడీ నుంచి సోనమణి గుడామ్ వరకు ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత పరిస్థితిపై అధికారులు ఏమంటున్నారు..?
ఎస్పీ అమిత్ రంజన్: సరిహద్దులోని పోలీసులు, ఎస్ఎస్బీ సిబ్బందిని హై అలర్ట్లో ఉండాలని ఆదేశించామని, సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి…మెగా కుటుంబంలో మరో వారసుడు.. తండ్రి అయిన వరుణ్ తేజ్!
ఎస్ఎస్బీ ఇన్స్పెక్టర్ ఉమేశ్ కుమార్: ప్రస్తుతం సరిహద్దులో ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ, ఏ క్షణంలోనైనా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని, నిఘా పెంచామని పేర్కొన్నారు.
ఈ పరిణామాలు నేపాల్లో అంతర్గత సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి. అలాగే సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను పెంచుతున్నాయి.