365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, 24 డిసెంబర్ 2022: తిరుమల శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జనవరి 1 నుంచి 5 వరకు ఆ ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
మొదటి రోజు జనవరి 1న శ్రీ వినాయక స్వామివారు,శ్రీ చంద్రశేఖర స్వామి వారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు.

రెండవ రోజు వల్లీ-దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఐదు చుట్లు విహరిస్తారు.
మూడవ రోజు శ్రీ సోమస్కంద స్వామి వారు ఐదు చుట్లు విహరిస్తారు.
నాల్గవ రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు భక్తులకు దర్శనమిస్తారు.
ఐదో రోజు శ్రీచండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు స్వామివారు దర్శనం అందిస్తారు .
స్వామి వారికీ ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
జనవరి 6వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తారు.

తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.